ఒంటి పూట బడులు, రోజు విడిచి రోజు తరగతులు.. ఏపీలో నవంబర్ 2 నుంచే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్
schools colleges reopen: ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఇంటర్ కాలేజీలు, స్కూల్స్ లో రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్ పద్దతిలో క్లాసులు నిర్వహిస్తారు. ఏపీలో నవంబర్ 2 నుంచి 9, 10, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. ఉన్నత విద్యకి సంబంధించి నవంబర్ 2 నుంచే తరగతులు ప్రారంభం అవుతాయి.
* నవంబర్ 2 నుంచి 9, 10, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్లాసులు
* నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం
* డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులు ప్రారంభం
* అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూర్ వర్తింపు
* కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ
* నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు
* పటిష్టంగా కోవిడ్ రక్షణ చర్యలు
* రోజు విడిచి రోజు పాఠశాలల్లో తరగతులు
* ఒంటిపూట బళ్లు
ఏపీలో నవంబర్ 2 నుంచి తిరిగి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. తరగతుల నిర్వహణపై ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అన్న రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ను వివరించారు.
1. నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం.
2. నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ క్లాసులు. రోజు విడిచి రోజు క్లాసులు. హాఫ్డే మాత్రం నిర్వహిస్తారు.
3. హయ్యర్ ఎడ్యుకేషన్కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు.
4. నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులకు బోధన ప్రారంభం. రోజు విడిచి రోజు, హాఫ్ డే క్లాసులు.
5. డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులు ప్రారంభం. రోజు విడిచి రోజు క్లాసులు, ఒంటి పూట క్లాసులు నిర్వహిస్తారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తింపు.