ఏపీలో ఇవాళ రెండో విడత వాహనమిత్ర.. ఆన్ లైన్ ద్వారా అకౌంట్ లో రూ.10 వేలు

  • Published By: bheemraj ,Published On : June 4, 2020 / 01:27 AM IST
ఏపీలో ఇవాళ రెండో విడత వాహనమిత్ర.. ఆన్ లైన్ ద్వారా అకౌంట్ లో రూ.10 వేలు

ఏపీ ప్రభుత్వం గురువారం (జూన్ 4, 2020) రెండో విడత వాహనమిత్ర పథకాన్ని అమలు చేయబోతుంది. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు వైస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థికసాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 37, 756 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది లబ్ధి పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తు దారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇవాళ ఆన్ లైన్ ద్వారా అకౌంట్ లో రూ.10 వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయనుంది.

మొత్తం 2 లక్షల 62 వేల 493 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్ లో ఇవ్వాల్సి ఉన్న కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Read: సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాం.. ప్రతి జిల్లాలో: డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌