పెందుర్తిలో ఆరుగురి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్టులు.. అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడమే కారణమా?

రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ జిల్లా పెందుర్తి 6 హత్యల కేసులో షాకింగ్ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అప్పలరాజు పగ ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అప్పలరాజు కుమార్తెని ప్రస్తుత బాధితుడు విజయ్ ప్రేమించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని, బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడని.. పోలీస్ స్టేషన్ లో అప్పలరాజు కుటుంబీకులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై 2018లో కేసు నమోదైంది. తన కుమార్తె జీవితం నాశనం అవ్వడానికి కారణమైన విజయ్ కుటుంబంపై అప్పలరాజు పగ పెంచుకున్నాడు. ఆ కుటుంబం వల్ల అన్యాయం జరిగిందన్న కక్షతోనే అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమయం కోసం వేచి చూసిన అప్పలరాజు.. గురువారం(ఏప్రిల్ 15,2021) ఆరుగురిని హత్య చేసినట్లు తెలుస్తోంది.

పెందుర్తిలో ఆరుగురి మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్టులు.. అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడమే కారణమా?

Visakha Murder Case

Visakha Murder Case : రాష్ట్రంలో సంచలనం రేపిన విశాఖ జిల్లా పెందుర్తి 6 హత్యల కేసులో షాకింగ్ కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అప్పలరాజు పగ ఏళ్ల నాటిదని తెలుస్తోంది. గతంలో అప్పలరాజు కుమార్తెని ప్రస్తుత బాధితుడు విజయ్ ప్రేమించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని, బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడని.. పోలీస్ స్టేషన్ లో అప్పలరాజు కుటుంబీకులు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై 2018లో కేసు నమోదైంది. తన కుమార్తె జీవితం నాశనం అవ్వడానికి కారణమైన విజయ్ కుటుంబంపై అప్పలరాజు పగ పెంచుకున్నాడు. ఆ కుటుంబం వల్ల అన్యాయం జరిగిందన్న కక్షతోనే అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. సమయం కోసం వేచి చూసిన అప్పలరాజు.. గురువారం(ఏప్రిల్ 15,2021) ఆరుగురిని హత్య చేసినట్లు తెలుస్తోంది.

six members murder

”నిందితుడు అప్పలరాజు కుమార్తెను రమణ కుమారుడైన విజయ్ గతంలో ప్రేమించాడు. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ విషయంలోనే 2018లో పెందుర్తి స్టేషన్‌లో విజయ్ కుటుంబ సభ్యులు అప్పలరాజుపై కేసు పెట్టారు. అప్పటి నుంచి విజయ్ కుటుంబంపై అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు జరిగేవి. అయితే కొన్నాళ్లకి విజయ్ ఉపాధి కోసం విజయవాడ వెళ్లిపోయారు. అక్కడే ఉష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. విజయ్ తండ్రి రమణ మాత్రం జుత్తాడలోనే ఉంటున్నారు” అని పోలీసులు తెలిపారు.

పెందుర్తిలో దారుణం- ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య- పాతకక్షతో కిరాతకంగా | old faction kill 6 members in a family in pendurthi of visakhapatnam district - Telugu Oneindia

“అయితే విజయవాడలో వచ్చే నెలలో ఒక పెళ్లి ఉంది. ఆ విషయమై విశాఖలో షాపింగ్ చేసి, పెళ్లి కార్డులు పంచడం కోసం రెండు రోజుల క్రితమే విజయ్ భార్య, ఇద్దరు పిల్లలు(రెండేళ్ల ఉదయ్, ఆరు నెలల ఉర్విష) తల్లి, మేనత్తతో కలిసి జుత్తాడ వచ్చారు. ఇవాళ ఉదయాన్నే షాపింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. వేకువజామున ఇంటి ముందు రమణ భార్య ముగ్గులు వేస్తున్నారు. ఈ విషయాన్ని ఎదురుగా గేదెలను కడుతున్న అప్పలరాజు చూశాడు. వెంటనే అక్కడే ఉన్న గడ్డి కోసే కత్తి తీసుకుని రమణ భార్యను నరికేశాడు. తర్వాత ఇంట్లో రమణ కోడలు, ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని అప్పలరాజే ఊరిలో కత్తి పట్టుకుని తిరుగుతూ అరుస్తూ చెప్పాడు”. అని జుత్తాడ గ్రామస్థులు వివరించారు. కాగా, జుత్తాడ గ్రామం పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ హత్యాకాండతో జుత్తాడ గ్రామంతో విశాఖ జిల్లా ఉలిక్కిపడింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.