గుంటూరులో షాకింగ్ మర్డర్.. కత్తులు, గొడళ్లతో కాదు జస్ట్ స్ప్రే తో హత్య, ఇంతకీ ఆ స్ప్రే లో ఏముంది? ఎందుకు చంపారు?

  • Published By: naveen ,Published On : November 7, 2020 / 04:08 PM IST
గుంటూరులో షాకింగ్ మర్డర్.. కత్తులు, గొడళ్లతో కాదు జస్ట్ స్ప్రే తో హత్య, ఇంతకీ ఆ స్ప్రే లో ఏముంది? ఎందుకు చంపారు?

shocking murder in guntur: అతడో హోటల్ యజమాని. హోటల్‌ వ్యర్థాలు పారబోసేందుకు ఊరి శివారుకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు..ముఖంపై స్ప్రే చల్లి పారిపోయారు. తీవ్ర గాయాలైన ఆ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. మరి ఆ దుండగులెవరు..? ఎందుకు చంపారు..?




ముఖంపై స్ప్రే చల్లడంతో మృతి:
కత్తులు, గొడ్డళ్లు చేతబట్టి కొందరు.. గొంతు నులిమి మరి కొందరు.. విష పదార్థాలతో ఇంకొందరు.. ఇలా హత్యలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల మర్డర్ల గురించి వినే ఉంటాం. ఏవో కొన్ని వివాదాల కారణంతో ఒకరినొకరు ఎన్నో రకాలుగా చంపుకోవడం సాధారణంగా జరిగే విషయమే. అయితే..గుంటూరులో షాకింగ్ మర్డర్ చోటుచేసుకుంది. ముఖంపై స్ప్రే చల్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బ్రహ్మయ్యపై స్ప్రే చల్లి దుండగుల పరారీ:
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటున్న భాష్యం బ్రహ్మయ్య(42)…స్థానికంగా హోటల్‌ని నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు. హోటల్‌లో వ్యర్థ పదార్థాలను పడేసేందుకు ఊరి చివరకు తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడకు గుర్తు తెలియని దుండగులు బైక్ పై వచ్చి బ్రహ్మయ్య పై స్ప్రే చల్లి పరారయ్యారు. ఈ ఘటనలో బ్రహ్మయ్య తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. దీంతో అతడే అతికష్టంపై ఇంటికి చేరుకున్నాడు. ముఖంపై కాలిన గాయాలు అయినట్లుగా కనిపించడంతో వెంటనే బ్రహ్మయ్యను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి అతడు ప్రాణాలు కోల్పోయాడు.
https://10tv.in/german-man-takes-covid-19-distancing-rules-to-extreme-with-pepper-spray/
స్ప్రేలో యాసిడ్ ఉందా?
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్‌ స్క్వాడ్‌తో కలిసి ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ దుండగుల గురించి అక్కడ ఎలాంటి ఆధారాలు లభించ లేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్రహ్మయ్యపై దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సాధారంణంగా స్ప్రే చల్లడం వల్ల మనిషి ప్రాణానికి ప్రమాదం ఉండదని, అయితే అందులో యాసిడ్ కలిపి ఉండవచ్చని భావిస్తున్నారు.




ఎవరు చంపారు? ఎందుకు చంపారు?
మరి బ్రహ్మాయ్యను చంపిన ఆ యువకులు ఎవరు..? ఓ పథకం ప్రకారమే చంపేశారా..? హోటల్‌ యజమానితో ఆ యువకులున్న సంబంధమేంటి..? ఆస్తి తగాదాలు కారణమా..? కుటుంబ కలహాలు ప్రాణం తీశాయా..? ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.