BJP Somu Veerraju: ఏపీలో ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే రూ.వేల కోట్ల నిధులు ఏమౌతున్నాయి: సోము వీర్రాజు

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల్లో శిఖర భాగం నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు

BJP Somu Veerraju: ఏపీలో ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే రూ.వేల కోట్ల నిధులు ఏమౌతున్నాయి: సోము వీర్రాజు

Somu

BJP Somu Veerraju: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల్లో శిఖర భాగం నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గురువారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసంధర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also read: Ayyanna Patrudu: ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది: చింతకాయల రాజేష్

పేదల ఇళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఇచ్చిందని..జగనన్న కాలనీ అని పేరు పెట్టుకునే ఆ పధకంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని సోమువీర్రాజు తెలిపారు. బడ్జెట్లో రూ.300 కోట్లు అమలాపురంకు కేటాయిస్తే ఫేస్ బుక్ లో హడావిడి చేసిన ఈ ప్రాంత ఎంపీ, మంత్రులు అవి తెచుకోలేకపోయారని సోమువీర్రాజు ఎద్దేవా చేశారు. విపత్తుల నిధుల కింద కేంద్రం రాష్ట్రానికి సుమారు రూ.30 వేల కోట్లు ఇవ్వగా అందులో రాష్ట్రానికి రూ.29 వేల కోట్లు ఇప్పటికే వచ్చాయని అయితే వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను ఏం చేసిందో చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఆహార సబ్సిడీ కింద రూ.వేల కోట్లు ఇస్తుందని..కరోనా సమయంలో వాటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయో తేల్చాలంటూ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత్య్సకార హార్బర్లు కట్టేందుకు గానూ కేంద్రం రూ.500 కోట్లు కేటాయించి మందులో రూ.350 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా..తీసుకోలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సోమువీర్రాజు దుయ్యబట్టారు.

Also read: Ayyanna Patrudu: ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది: చింతకాయల రాజేష్

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది కాబట్టే రూ.40 వేల కోట్లు ఇచ్చామని మోదీ చెబుతున్నారని.. అయితే రెండు ప్రభుత్వాల హయాంలో ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు వివరించాలని సోము వీర్రాజు అన్నారు. కేంద్రం నుంచి వేల కోట్లు నిధులు తెచ్చుకున్న సీఎం జగన్ ను.. అమలాపురం రైల్వే ప్రాజెక్టు కోసం రూ.300 కోట్లు ఇవ్వాలని మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రప్రభుత్వాన్ని అడిగారని.. అయితే దానిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని సోమువీర్రాజు తెలిపారు. సీఎం జగన్ పోలవరాన్నీ పూర్తి చేసేందుకు రూ.55 వేల కోట్లు కేంద్రాన్ని అడుగుతున్నారని.. అయితే తన వాటాగా కేంద్రం చేయాల్సిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చిందని వివరించారు. ప్రాజెక్ట్ నిబంధనలు, షరతులపై అవగాహన లేకుండా పోలవరం ఎవరు కట్టమన్నారని సోమువీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే ఏపీ బీజేపీ ఉద్దేశమని స్పష్టం చేశారు.

Also read: Pawan kalyan : బిల్ గేట్స్‌తో మీటింగ్ ఉన్నా కూడా వచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు