వివేకా హత్య కేసు : ఎమ్మెల్సీ బీటెక్ రవి విచారణ

  • Published By: madhu ,Published On : December 5, 2019 / 03:44 AM IST
వివేకా హత్య కేసు : ఎమ్మెల్సీ బీటెక్ రవి విచారణ

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. రెండు రోజుల నుంచి విచారణలో స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం… వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు.. ఇంట్లో పని చేసేవారని రహస్యంగా ప్రశ్నించింది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు మరికొంత మంది నేతలను 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం విచారించనున్నారు. విచారణకు హాజరుకావాలని బీటెక్ రవికి నోటీసులు జారీచేశారు. విచారణలో ఆయన చెప్పే సమాధానాలను బట్టి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం బీటెక్ రవి, సిట్ విచారణకు హాజరుకానున్నారు. 

మూడో రోజు 2019, డిసెంబర్ 04వ తేదీ బుధవారం నలుగురు వ్యక్తులను సెట్ బృందం పిలిపించి విచారణ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన ఇంట్లో పని చేసిన వంట మనుషులు, వాచ్‌మెన్, డ్రైవర్లను సిట్ ప్రశ్నించింది. వివేకానంద హత్య జరిగిన రోజు… ఆయన ఎన్ని గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు ఆయనతో ఎవరెరున్నారు. అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. హత్య జరిగిన రోజు రాత్రి వివేకానంద ఇంటికి వచ్చిన సమయంలో ఎవరెవరున్నారు. ఇంట్లో ఒక్కడే నిద్రపోయాడా.. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాడా… అనే వియంపైనా పోలీసులు దృష్టిపెట్టారు. 

ఇప్పటికే వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మరోసారి అతన్ని పిలిచి విచారించారు. ఈ మూడు రోజుల్లో 12మందిని ప్రశ్నించిన పోలీసులు… పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు… వివేకా హత్య కేసులో అనుమానితులు చెప్పిన వివరాలను బట్టి మిగతావారికి నోటీసులు జారీచేస్తున్నారు. వివేకానంద హత్య కేసు విచారణ మధ్యలో వేగం తగ్గింది. దీంతో విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం సొంత బాబాయ్ హత్య నిందితులను పట్టుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. దీంతో ఎంక్వైరీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో… సిట్ తన దర్యాప్తు స్పీడ్ మరింత పెంచింది.
Read More : కియా మోటర్స్ కంపెనీ ఓపెనింగ్ సెర్మనీ