srikakulam: వాళ్లకు గుణపాఠం చెప్పాలి: మంత్రి సీదిరి అప్పలరాజు

వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

srikakulam: వాళ్లకు గుణపాఠం చెప్పాలి: మంత్రి సీదిరి అప్పలరాజు

Seediri Appalaraju

srikakulam: వైసీపీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్, పార్టీని గెలుపువైపు నడిపించాలని సూచించారు. ‘‘గతంలో అధ్యక్షురాలిగా ఉన్న కిల్లి కృపారాణి, జగన్ మీద ఈగవాలినా శివంగిలా లేచేవారు. ఇప్పుడు ధర్మన కూడా సింహంలా పనిచేయాలి. అందరినీ సమష్టిగా కలుపుకుని పార్టీని ముందుకు నడిపించాలి.

Srikakulam : ఆ ఊర్లో కరోనా కేసులు లేకున్నా లాక్‌డౌన్‌.. ఎందుకో తెలుసా?

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు గుణపాఠం చెప్పాలి. వైసీపీ కార్యకర్తల పార్టీ. కార్తకర్తలకు అండగా, అందుబాటులో ఉంటుందని తెలియజేయాలి. మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం ముందుగానే చెప్పారు. తొలగించిన మంత్రుల్లో కీలక వ్యక్తులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని చెప్పినట్లుగానే ధర్మానకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ లక్ష్యంవైపు నడుస్తుందని ఆశిస్తున్నా. జిల్లాలోని ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకోవాలి. ఆయనకు దక్కిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.