వివాహేతర సంబంధంతో ఇద్దరి ఆత్మహత్య ?

వివాహేతర సంబంధంతో ఇద్దరి ఆత్మహత్య ?

deaths

suspecious deaths in west godavari district : పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది.వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా ఈ కేసులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి, వారు ఆత్మహత్య చేసుకున్నారా, లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

నిడదవోలు మండలం తాళ్లపాలెంగ్రామానికి చెందినఆటో డ్రైవర్ యామన శ్రీనివాసరావు కు ఏలూరు కు చెందిన కుసుమనాగసాయి(30) అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందే నాగసాయికి ఏలూరు కు చెందిన షేక్ నాగూర్(28) అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉంది.

పెళ్లయ్యాక భర్తకు తెలియకుండా నాగసాయి నాగూర్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. భర్తకు తెలియకుండా తాళ్లపాలెంలోనే బంధువుల ఇంట్లో వారిద్దరూ కలుసుకుంటూ ఉండేవారు. అదేక్రమంలో ఆదివారం తాళ్లపాలెం వచ్చిన నాగూర్, నాగసాయి తెలిసిన వాళ్లింట్లో కలిసి మాట్లాడుకుంటున్నారు.

ఈ సంగతి తెలుసుకున్న నాగసాయి భర్త శ్రీనివాసరావు,బంధువులతో కలిసి వచ్చి వారిద్దరినీరెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కారులో శెట్టిపేట లో ఉన్న శ్రీ కృష్ణమొబైల్ ఫాస్ట్ ఫుడ్ షాపు గదిలోకి తీసుకువెళ్లి ఇద్దరినీ బంధించారు. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ ఆ గదిలో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

అనంతరం శ్రీనివాసరావు వాళ్లు బంధువులు వచ్చి చూడగా  ప్రేమికులిద్దరూ  చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వెంటనే వారిని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా….. నాగసాయి వివాహేతర సంబంధం తెలుసుకున్న శ్రీనివాసరావు అతని కుటుంబసభ్యులు, బంధువులే వీరిద్దరినీ దారుణంగా కొట్టి బలవంతంగా పురుగుల మందు తాగించి ఉంటారని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని నాగసాయి భర్త శ్రీనివాసరావు అతని కుటుంబసభ్యులు బంధువులను ప్రశ్నిస్తున్నారు.