Anantapur : ప్రేమ పేరుతో ఎస్సై మోసం-యువతి ఆత్మహత్య
ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.
Anantapur : ప్రేమ, పెళ్ళి పేరుతో ఎస్సై చేతిలో మోసానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లైన ఎస్సై మరో యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు.
వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ(జీఏ) కొట్టాలకు చెందిన రమావత్ విజయ్ కుమార్ నాయక్ తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్సై గా పని చేస్తున్నారు. ఈయన గతంలో అనంతపురానికి చెందిన భారతి అనే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోటానికి ఒప్పుకోక పోవటంతో భారతి దిశ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తొమ్మిది నెలల క్రితం దిశ డిస్పీ ఆధ్వర్యంలో విచారణ చేసి వారి పెళ్లి చేశారు.
అనంతరం కాలంలో తన స్వగ్రామమైన జీఏ కొట్టాలకు చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతి(20)తో ప్రేమాయణం మొదలెట్టాడు ఎస్సై విజయకుమార్. సరస్వతి తిరుపతిలో ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించకపోవటంతో సరస్వతి రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అనంతపురం లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరస్వతి శుక్రవారం మృతి చెందింది.
సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్సై విజయకుమార్ నాయక్ పై ఐపీసీ సెక్షన్ 306, 376, 420 ల కింద కేసులు నమోదు చేశారు. తిరుపతి ఎస్పీతో మాట్లాడి నిన్న విజయకుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. సరస్వతి, విజయ్ కుమార్ ప్రేమ పేరుతో కలిసి తిరిగిన ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Rahul Gandhi : టీఆర్ఎస్తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ