వైసీపీలో చేరుతున్న టీడీపీ నేతలు..అభ్యర్థులను కాపాడుకునేందుకు తెలుగుదేశం క్యాంప్ పాలిటిక్స్
TDP camp politics : మున్సిపల్ ఎన్నికలకు ముందే శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీకి షాక్ తగిలింది. పార్టీ తరపున గతేడాది నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది.
4,8,20,29 వార్డుల్లో టీడీపీ తరపున నామినేషన్లు వేసిన వాయలపల్లి లక్ష్మణరావు, రోనంకి మురళీ కృష్ణ, బమ్మిడి వెంకట లక్ష్మి, సనపల హరి… మొన్న సాయంత్రం నుంచే అజ్ఞాతంలోకి వెళ్లారు. రోనంకి మురళీ కృష్ణను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపించిన కాసేపటికే వైసీసీ కండువాతో కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమయింది. డమ్మీ నామినేషన్లు వేసిన వారు కూడా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
దీంతో మిగతా వార్డుల్లో పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులను కాపాడుకునే క్రమంలో టీడీపీ క్యాంప్ పాలిటిక్స్ నడుపుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలోనూ ఇంతవరకు ఇలాంటి క్యాంప్ పాలిటిక్స్ చూశాం కానీ…తొలిసారి మున్సిపల్ ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను కాపాడుకునేందుకు క్యాంప్ పాలిటిక్స్ నడవడం మరింతగా చర్చనీయాంశమైంది.