Chandrababu : బాబును ఏమీ అనొద్దు, వంద మందితో సూసైడ్ బ్యాచ్.. చంపడానికైనా..చావడానికైనా సిద్ధం

వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగిందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా...

Chandrababu : బాబును ఏమీ అనొద్దు, వంద మందితో సూసైడ్ బ్యాచ్.. చంపడానికైనా..చావడానికైనా సిద్ధం

Babu

Buddha Venkanna sensational Comments : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు బర్త్ డే రోజున టీడీపీ పార్టీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేయడం జరిగిందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని..చంపడానికైనా.. చావడానికైనా తాము సిద్ధమని వ్యాఖ్యలు చేయడం ఏపీ పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Read More : Ganta Srinivasa Rao : సెగలు రేపుతున్న గంటా శ్రీనివాసరావు కామెంట్స్..వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ వలసలు ఉంటాయంటూ హింట్

2022, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో బాబు జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బాబు భారీ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ… ప్రతి మనిషిలో కృతజ్ఞత అనేది ఉండాలని, తనకు నాగుల్ మీరాకు బాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు కటౌట్ కు పంచామృతాలతో పాలాభిషేకం చేయడమే కాకుండా 500మందికి చీరెలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ రెండు సంవత్సరాల్లో చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయని భావిస్తున్నారని, ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మరోసారి బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

Read More : Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు

ఇదే కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ నేతృత్వంలో వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, జగన్ వైఫల్యాలపై ప్రజలు విసిగి పోయారని విమర్శించారు. చంద్రబాబు పాలన మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నట్లు, బాబు ముందు చూపు వల్లే ఉమ్మడి ఏపీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఒక్క చాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చి ఆయన్నునమ్మి ఓట్లేస్తే ప్రజలను నట్టేట ముంచాడన్నారు. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని నాగుల్ మీరా తెలిపారు.