విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్‌ పదవులకు జరగిన పోలింగ్‌‌లో 7, 757 మంది పోటీ పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మండలాల్లోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా.. తొలి రెండు విడతల్లో మాదిరే మూడో విడతలోనూ అధికారపార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి పోటాపోటీ పరిస్థితి కనిపించింది. ఎక్కువ స్థానాలు మాత్రం వైసీపీనే కైవసం చేసుకుంది. టీడీపీ మద్దతుదారులు విశాఖ జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించగా.. మిగిలిన జిల్లాల పంచాయతీల్లో వైసీపీ మద్దతు దారులు గెలుపొందారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను గెలిచారు. ఈ పరిస్థితితో తెలుగుదేశం పార్టీ ఖంగుతిన్నది.