Buddha Venkanna: బద్వేల్‌లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీనే!

కడప జిల్లా బద్వేల్‌లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.

Buddha Venkanna: బద్వేల్‌లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీనే!

Buddha Venkanna: కడప జిల్లా బద్వేల్‌లో గెలిచామని వైసీపీ సంబరాలు చేసుకోవడం కామెడీ సినిమాను తలపిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న. దొంగఓట్లు వేయించుకుని సాధించిన విజయానికి కూడా సంబరాలు చేసుకోవడం అధికారపార్టీకే చెల్లింది.

జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యేలకు నిజంగా ప్రజల్లో అంతటి ఉంది అనుకుంటే, మూకుమ్మడి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. జగన్‌కు ఓటేసినందుకు ప్రజలు ఇప్పటికే చెప్పులతో కొట్టుకుంటూ, సోషల్ మీడియాలో తమ వేదనను వెళ్లగక్కుతుంటే, వైసీపీ వాళ్లు మాత్రం మా పాలన చూసి గెలిపించారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మళ్లీ చాన్స్ ఇచ్చే అవకాశమే లేదనే ఉద్ధేశ్యంతో జగన్ మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడ్డారని చెప్పుకొచ్చారు బుద్దా వెంకన్న. మద్యం, ఇసుక, గనులు, గంజాయి, మాదక ద్రవ్యాలు సహా ప్రజలపై వేస్తున్న పన్నుల ఆదాయం అంతా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరుతుందని ఆరోపించారు బుద్దా వెంకన్న. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని జగన్ పీకేతో కలిసి ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

న్యాయస్థానం టూ దేవస్థానం ‘మహా పాదయాత్ర’ నిర్వహిస్తున్న వారికి ఏం జరిగినా అందుకు జగనే బాధ్యత వహించాలని అన్నారు వెంకన్న. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తప్ప, ఎక్కడా ఒక్క గ్రావెల్ రోడ్డు కూడా ప్రభుత్వం వేయలేదన్నారు బుద్దా వెంకన్న.