TDP Lokesh : సీఎం జగన్‌కు లోకేశ్‌ బహిరంగ లేఖ

పేపర్లు లీక్‌ అవుతుంటే.. ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు. ఆయనను విద్యాశాఖ నుంచి త‌ప్పించాలన్నారు.

TDP Lokesh : సీఎం జగన్‌కు లోకేశ్‌ బహిరంగ లేఖ

Lokesh

TDP Lokesh : ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పేప‌ర్ల లీక్‌, మాస్ కాపీయింగ్‌తో విద్యార్థుల‌కు తీర‌ని న‌ష్టం జరుగుతోందని లోకేశ్‌ లేఖలో ప్రస్తావించారు. పేప‌ర్ల లీక్‌, మాల్ ప్రాక్టీస్‌, మాస్ కాపీయింగ్‌పై మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఇచ్చిన స‌మాధానం కూడా బాధ్యతారాహిత్యమే అన్నారు.

పేపర్లు లీక్‌ అవుతుంటే.. ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి బొత్స మాట్లాడటం సరికాదన్నారు. ఆయనను విద్యాశాఖ నుంచి త‌ప్పించాలన్నారు. ఇంకా మిగిలిన రెండు పరీక్షల్ని అయినా ప‌క‌డ్బందీగా నిర్వహించాలని కోరారు. టెన్త్ ప‌రీక్షల వైఫ‌ల్యంతోనైనా గుణ‌పాఠం నేర్చుకుని.. ఇంట‌ర్ ప‌రీక్షలు ప‌క‌డ్బందీగా నిర్వహించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.