మనసెలా ఒప్పింది జగన్ ? : ట్విట్టర్‌లో లోకేష్ ఫైర్

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 10:34 AM IST
మనసెలా ఒప్పింది జగన్ ? : ట్విట్టర్‌లో లోకేష్ ఫైర్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ..వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ట్వీట్ల ద్వారా దుయ్యబడుతున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై పోస్టులు చేస్తూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు నారా లోకేష్. కొన్ని రోజులుగా మూడు రాజధానులు అంశం వేడి పుట్టించగా..కియా వివాదం తెరమీదకు వచ్చింది. తాజాగా భారీగా పెన్షన్‌‌లను తీసేస్తున్నారంటూ టీడీపీ ధ్వజమెత్తుతోంది. దీనిపై 2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారం నారా లోకేష్ ట్వీట్స్ చేశారు.

ఎలాంటి ట్వీట్ చేశారంటే :-
1)  ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో ! రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు. పేద ప్రజల పట్ల ఆయనకి ఉన్న వ్యతిరేకతని పెంచుకుంటూ పోతున్నారు. 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారు అని మొదటి ట్వీట్‌లో విమర్శించారు. 
 

2) మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తియ్యలేదు అని బుకాయించిన వైకాపా ప్రభుత్వం, రీ వెరిఫికేషన్ పేరుతో కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? ఇప్పుడు 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ ? అంటూ రెండో ట్వీట్‌లో ప్రశ్నించారు. 
 

3) ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు. పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా ? పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారు ? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్ సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారు అంటూ నాలుగో ట్వీట్‌లో విమర్శలు చేశారు నారా లోకేష్. ఈ ట్వీట్లపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.