పాలన అంటే టిక్ టాక్ లు కాదు : భువనేశ్వరిని విమర్శించే అర్హత లేదు

ఏపీలో అధికార, ప్రతిపక్ష మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని అంశంపై విమర్శల పర్వం నడుస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 10:56 AM IST
పాలన అంటే టిక్ టాక్ లు కాదు : భువనేశ్వరిని విమర్శించే అర్హత లేదు

ఏపీలో అధికార, ప్రతిపక్ష మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని అంశంపై విమర్శల పర్వం నడుస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి

ఏపీలో అధికార, ప్రతిపక్ష మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాజధాని అంశంపై విమర్శల పర్వం నడుస్తోంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు చేశారు. ఇవ్వాల్సింది గాజులు కాదు భూములు అని చెప్పారు. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు టీడీపీ మమిళా నేతలు కౌంటర్ ఇచ్చారు. 

పాలన అంటే టిక్ టాక్ వీడియోలు కాదని డిప్యూటీ సీఎంను ఉద్దేశించి టీడీపీ నేతలు అనురాధ, అనిత అన్నారు. రాజధాని అమరావతి కోసం రాష్ట్రంలోని మహిళలంతా ఆందోళన వ్యక్తం చేస్తుంటే సాటి మహిళగా వారికి అండగా నిలవాల్సిందిపోయి పుష్పశ్రీవాణి టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేయటం సిగ్గుచేటని టీడీపీ అధికార ప్రతినిధి వంగలపూడి అనిత మండిపడ్డారు. పుష్పశ్రీవాణి దొంగ సర్టిఫికెట్ తో ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని ఆరోపించారు. భువనేశ్వరిని విమర్శించే నైతిక అర్హత ఆమెకు లేదన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎంకు.. అసలు దాని అర్థం తెలుసా? అని అనిత ప్రశ్నించారు. హెరిటేజ్ భూములకు, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు సంబంధమే లేదన్నారు. కంపెనీ విస్తరణ దృష్ట్యా ఏపీలో భూములు కొనాలని 2014 మార్చిలోనే హెరిటేజ్ బోర్డు నిర్ణయం తీసుకుందని అనిత వివరించారు. ఆ భూములు కూడా రాజధాని పరిధిలో లేవని తెలిపారు. బిజినెస్ కోసం భూములు కొనటం ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందో చెప్పాలని మంత్రిని అనిత డిమాండ్ చేశారు.

అమరావతిలో రోడ్లపై ఆందోళనలు చేస్తున్న రైతులకు అండగా నిలిచి ధైర్యం చెప్పేందుకు భువనేశ్వరి వెళ్లారని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ అన్నారు. పరిపాలన అంటే టిక్‌ టాక్‌లు కాదనే విషయాన్ని పుష్పశ్రీవాణి తెలుసుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామంటే.. పుష్పశ్రీవాణి అందుబాటులో ఉండటం లేదన్నారు.

ఇటీవల సీఎం జగన్ పై పాటకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..’ అనే పాటకు శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు. అలా జగన్ పై తనకున్న అభిమానాన్ని మంత్రి చాటుకున్నారు. డిప్యూటీ సీఎం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!