సెప్టెంబరు 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు ప్రారంభం

సెప్టెంబరు 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో కాలేజీలు ప్రారంభం

కరోనాకు భయపడుతూ ఇంట్లో కూర్చొంటే కాలం ఆగుతుందా అనుకున్నదేమో గవర్నమెంట్ సీరియస్ నిర్ణయం తీసుకుంది. విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ 1నుంచి మొదలుపెట్టేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే డిగ్రీ కాలేజీల్లో క్లాసులు ప్రారంభించబోతున్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా టీచింగ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చేశాయి.

అంటే అధికారికంగా 2020-2021 విద్యా సంవ‌త్స‌రం సెప్టెంబర్ 1నుంచి ప్రారంభం అవుతుందన్నట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసి విషయాన్ని వెల్లడించింది. మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లోనే క్లాసులు బోధించనున్నట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్ర‌కారమే త‌ర‌గ‌తుల నిర్వహణ జరుగుతుందని పేర్కొంది. ఈ త‌ర‌గ‌తుల ప్రారంభానికి ముందే ఆగష్టు 27 నుంచే ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు రావాల్సి ఉంటుంద‌ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం గురించి మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఆగష్టు 5న భేటీ అయింది. ఈ స‌మావేశంలో విద్యా సంవ‌త్స‌ర ప్రారంభం స‌హా అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా బోధన ఎలా జ‌ర‌పాలనే అంశాలపై చ‌ర్చలు జరిపింది ప్రభుత్వం.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు నుంచే ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. కాలేజీలు సెప్టెంబర్ నుంచే మొదలుపెట్టాలని కొద్ది రోజుల ముందుగానే ఆర్డర్లు ఇచ్చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యాసంస్థలు సెప్టెంబరు నుంచే ప్రారంభం అవుతున్నాయన్నమాట.