AP Corona : ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు

గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది.

AP Corona : ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు

Corona (2)

AP corona cases : ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా సోకి గత 24 గంటల్లో 11 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 1,00,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,86,566కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 14,631 మంది మృతి చెందారు. కరోనాతో విశాఖ జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ప.గో జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో 741, గుంటూరు జిల్లాలో కొత్తగా 738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం 488, చిత్తూరు 462, కడప 608, కృష్ణ 618, కర్నూలు 579, నెల్లూరు 304, ప్రకాశం 293, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 388, విజయనగరం 112, పశ్చిమ గోదావరిలో 565 చొప్పున నమోదు అయ్యాయి.

Ratan TATA : ఎయిర్‌ఇండియా ప్రయాణికులకు రతన్‌టాటా ఆడియో మెసేజ్‌

గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది. గత 24 గంటల్లో 35,040 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,24,40,787కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1,00,622 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,81,109 మంది కోలుకున్నారు. కాగా, ఒక్కరోజే 1,733 మంది కరోనాతో మరణించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 51,887, తమిళనాడులో 16,096, మహారాష్ట్రలో 14,372, కర్ణాటకలో 14,366, గుజరాత్ లో 8,338 కేసులు నమోదయ్యాయి.