OBC Reservation : కాపు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఏపీ ప్రభుత్వ పరిధిలోని అంశం

కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలన్నారు. కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

OBC Reservation : కాపు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఏపీ ప్రభుత్వ పరిధిలోని అంశం

Gvl

Kapu OBC Reservation : కాపు ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఏపీ ప్రభుత్వ పరిధిలోని అంశం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాపు రిజర్వేషన్ బిల్లు అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నలకు సామాజిక న్యాయం, సాధికారత, హోం మంత్రిత్వ శాఖల సమాధానాలు ఇచ్చాయి. రెండు మంత్రిత్వ శాఖలు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వంలో ఓబీసీ రేజర్వేషన్ల అంశం స్టేట్ లిస్ట్ కు సంబంధించింది కనుక, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేశాయి. కాపు (విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్లు మరియు రాష్ట్ర పరిధిలోని సేవల్లో నియామకాలు లేదా పోస్టులు) బిల్లు, 2017 గౌరవనీయ భారత రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పంప బడినందున, ఇది సాధారణ ప్రక్రియగా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు పంపబడింది. కొన్ని మంత్రిత్వ శాఖల నుండి వచ్చిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపటం జరిగింది.

BJP Janasena Government : ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమే-జీవీఎల్

రాష్ట్ర OBC జాబితాలో ఒక కులాన్ని చేర్చడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ, 04.04.2019న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన కాపు OBC బిల్లు, 2017ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని రెండు మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో 50 శాతానికి మించిన మరాఠా OBC రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం భారత రాష్ట్రపతి ఆమోదం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

టీడీపీ, వైసీపీ రెండు పార్టీల ప్రభుత్వాలు కాపు సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు భారత రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. ఈ విషయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని పార్లమెంటు స్పష్టంగా తెలియ చేసిందని చెప్పారు.

Andhra Pradesh: అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

పార్లమెంటులో కేంద్ర ప్రభత్వం తన ప్రశ్నలకు సమాధానమిస్తూ స్పష్టత ఇచ్చిన సందర్భంగా, గతంలో కేంద్రానికి అనవసరంగా పంపిన కాపు ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు-2017ను కేంద్రం నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తక్షణమే స్పష్టం చేయాలన్నారు. కాపులకు సామజిక న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.