అత్తింటివారి వేధింపులు.. పెళ్లైన నెల రోజులకే ఆత్మహత్య చేసుకున్న నవవధువు
new bride committed suicide : చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. కుప్పం మండలంలోని కూర్మాయిపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గత నెల 28 తేదీన చైతన్యకు తంగవేలుతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నెల రోజులకే చైతన్య ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆమె కుటుంబీకులు, బంధువులు వరుడి ఇంటిపై దాడికి దిగారు. అత్తింటి వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ వరుడి ఇంటిని తగలబెట్టారు.
https://10tv.in/hyderabad-yapral-theft-case-daughter-in-law-who-stole-in-attint-for-mothers-debts/
ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో వరుడి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.