పేదలకు ఇచ్చే ప్లాట్లలోనే టీడీపీ నేత హత్య.. అంత్యక్రియలను నిర్వహించబోమంటున్న నేతలు

పేదలకు ఇచ్చే ప్లాట్లలోనే టీడీపీ నేత హత్య.. అంత్యక్రియలను నిర్వహించబోమంటున్న నేతలు

TDP leader Nandam Subbaiah murder : కడప జిల్లా ప్రొద్దుటూరులో హై టెన్షన్ నెలకొంది. నందం సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. సుబ్బయ్య హత్యకు కారకులైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదని తెగేసి చెబుతున్నారు.

మంగళవారం టీడీపీ నేత సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పేదలకు ఇచ్చే ప్లాట్లలోనే సుబ్బయ్యను హతమార్చారు. ఇవాళ నందం సుబ్బయ్య కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించనున్నారు.

మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదిగా టీడీపీ నేత లోకేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. కడప జిల్లాలో దారుణ హత్యకు గురైన టీడీపీ జిల్లా నేత నందం సుబ్బయ్య కిరాతంగా హత్య చేశారంటూ అధికార పార్టీపై లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను హత్య చేశారని లోకేష్‌ ఆరోపించారు.

రాయలసీయలో శాంతిభద్రలు తలెత్తాయన్నారు. హత్యకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి.. వెంటనే అరెస్ట్‌ చేయాలని ట్విట్టర్‌ వేదిగా డిమాండ్‌ చేశారు. బాధితకుటుంబానికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారు.