డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు భార్యాభర్తలను కట్టేసి కొట్టారు

  • Published By: bheemraj ,Published On : July 16, 2020 / 08:45 PM IST
డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు భార్యాభర్తలను కట్టేసి కొట్టారు

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు.

మహిళ జుట్టు కత్తిరించి, కళ్ళళ్ళో కారం చల్లి విచక్షణారహితంగా కొట్టారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. తన ఫిర్యాదును ఎస్పీ పట్టించుకోలేదని పైగా తమనే తిట్టారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

బాధితురాలు…
‘ముగ్గురు మగవారు కలిసి పది మంది ఇంటికి వచ్చారు. కత్తెరతో నా చేతికి పొడిచారు. మా కళ్లల్లో కారం కొట్టారు. తాళం వేసి పది మంది నన్ను, నా భర్తను కొట్టారు. నాతో కారు కొనిపించుకున్నాడు. డౌన్ పే మెంట్ మొత్తం పది లక్షల డబ్బులు ఇచ్చాను. కావాలని గేమ్ ఆడి వారందరినీ పంపంచి నన్ను కొట్టించాడు.

టూటౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. సార్ వచ్చాక మాట్లాడుతామని మా కారు తాళం చెవిలు కూడా లాక్కున్నారు. మమ్మల్ని బయటికి రానియ్యకపోతే నేను పరుగెత్తుకొచ్చాను. సీఐ వచ్చాక మాట్లాడితే కేసు ఎందుకు పెడుతున్నారని అంటున్నారు. అందుకే ఇక్కడికి వచ్చా..కానీ వీరు డీఎస్పీ దగ్గరకు వెళ్లమంటున్నారు’ అని ఏడుస్తూ చెప్పారు.