తిరుమల నడకదారిలో భక్తులపై దొంగల దాడి..దోపిడికి యత్నం

తిరుమల నడకదారిలో భక్తులపై దొంగల దాడి..దోపిడికి యత్నం

Thieves attack devotees on Tirumala walkway : తిరుమల నడకదారిలో దోపిడి దొంగలు హల్‌చల్‌ చేశారు. అలిపిరి నడక మార్గంలో కర్నూల్‌కు చెందిన భక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. భక్తులు ప్రతిఘటించడంతో దొంగలు.. అడవుల్లోకి పారిపోయారు. దోపిడీపై 100కు భక్తులు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు. దుండగుల కోసం పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గాలిస్తున్నారు.

పోలీసులు స్పందించకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని భక్తులు అంటున్నారు.
తాము గ్రూప్ గా ఫామ్ అయి రాళ్లు, కేకలు వేసుకుంటూ భయ పడుతూ వచ్చామని చెబుతున్నారు. పోలీసుల సహకారంతో తాము ఇక్కడి వరకు రాగలిగామని చెప్పారు.