keesara toll plaza వద్ద ట్రాఫిక్ జాం..మూడు రోజులు హాలీడేస్

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 05:56 AM IST
keesara toll plaza వద్ద ట్రాఫిక్ జాం..మూడు రోజులు హాలీడేస్

keesara toll plaza: వరుసగా సెలవులు రావడంతో తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు ప్రజలు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేయాలని అనుకుని వారి వారి వాహనాల్లో రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ప్రధానంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి.



2020, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి, 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం, 2020, అక్టోబర్ 04వ తేదీ ఆదివారం. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వాహనాలతో కిటకిటలాడిపోతోంది.



వేల సంఖ్యలో వాహనాలు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలా మంది ప్రయాణికులు తరలి వెళుతున్నారు. కీసర టోల్‌ ప్లాజా కిక్కిరిసిపోయింది. గంటలు తరబడి ట్రాఫిక్ స్థంభించిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.