East Godavari: బాయిలర్ క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికుల మృతి.. ఆక్సిజన్ అందకే..?
తూర్పు గోదావరి జిల్లా బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ఇవాళ ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బందపురం సమీపంలో పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీ ఉంది. అందులో బాయిలర్ క్లీన్ చేస్తున్న ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురికావడంతో గమనించిన తోటి కార్మికులు వారిని కొవ్వూరు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు. అయితే, చికిత్స పొందుతోన్న ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు.
East Godavari: ఓ పరిశ్రమలో బాయిలర్ క్లీనింగ్కు వెళ్ళి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆక్సిజన్ అందకే వారు మృతి చెందినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ఇవాళ ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బందపురం సమీపంలో పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీ ఉంది. అందులో బాయిలర్ క్లీన్ చేస్తున్న ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురికావడంతో గమనించిన తోటి కార్మికులు వారిని కొవ్వూరు ఆసుపత్రి తరలించి, చికిత్స అందేలా చేశారు.
అయితే, చికిత్స పొందుతోన్న ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. మరొక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన కార్మికుల పేర్లు డమా బిరువా (23), గాజుల శ్రీను (26)గా పోలీసులు గుర్తించారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలోని సురక్షిత చర్యలు చేపట్టకుండా ముగ్గురు కార్మికులను బాయిలర్ క్లీనింగ్కు పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఆక్సిజన్ అందక కార్మికులు అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
China: చైనా-తైవాన్ మధ్య యుద్ధ వాతావరణం.. తైవాన్ రక్షణ శాఖ వెబ్సైట్ హ్యాక్