ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్

ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణం తీసిన వాటర్ హీటర్

Three members died of electric shock : కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. హాల్వహర్వీ మండలం గూల్యం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఉదయం వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమారులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఉదయం పిల్లలు స్నానం చేయడానికి వేడి నీటి కోసం వాటర్ హీటర్ పెడుతున్న సమయంలో తల్లికి విద్యుత్ షాక్ కొట్టింది. తల్లిని పట్టుకున్న ఇద్దరు చిన్నారులకూ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నితిన్ (8), వెంకట్ (11), తల్లి (30).

వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.