పోలీసులకు భయపడి కాల్వలో దూకిన ముగ్గురు యువకులు : ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 05:39 AM IST
పోలీసులకు భయపడి కాల్వలో దూకిన ముగ్గురు యువకులు : ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.

ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం (అక్టోబర్ 30, 2019) రాత్రి విజయ్‌నగర్ కాలనీలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు… వారి నుంచి తప్పించుకునేందుకు ఈపురుపాలెం కాల్వలో దూకారు. 

యువకులు ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఈపురుపాలెం కాల్వలో గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి దాటాక మధు మృతదేహం లభించింది. దీంతో మిగతా ఇద్దరి కోసం స్థానికులు తెల్లవార్లు గాలించగా కొద్దిసేపటి క్రితం శ్రీను మృతదేహం కూడా లభ్యమైంది. కాల్వలో దూకిన మరో యువకుడి గాలింపు కొనసాగుతోంది. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.