ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన బైక్…ముగ్గురు యువకులు మృతి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : లారీని ఢీకొట్టిన బైక్…ముగ్గురు యువకులు మృతి

Three young men killed in Road accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు ఫ్లై ఓవర్ పై లారీని ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

అతి వేగంతో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌ పై వస్తున్న యువకులు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో జమ్మలమడక గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు.

మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.