TIDCO Houses : నెరవేరనున్న కల.. 19న గుడివాడలో లబ్దిదారులకు టిడ్కో ప్లాట్లు అందజేయనున్న సీఎం జగన్

TIDCO Houses : టీడీపీ హయంలో నామమాత్రంగా 1200 ప్లాట్ల నిర్మాణం జరిగితే, వైసీపీ పాలనలో 9వేల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు కొడాలి నాని.

TIDCO Houses : నెరవేరనున్న కల.. 19న గుడివాడలో లబ్దిదారులకు టిడ్కో ప్లాట్లు అందజేయనున్న సీఎం జగన్

TIDCO Houses(Photo : Google)

TIDCO Houses : కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 19న టిడ్కో ప్లాట్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలసిల రఘురాం పరిశీలించారు. ఎమ్మెల్సీ రఘురాం, అధికార బృందానికి లేఔట్ మొత్తం తిప్పి చూపించారు మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

ఈ నెల 19న గుడివాడ, 22న మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటిస్తారని కొడాలి నాని తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవాంతరాలు లేకుండా నిర్వహిస్తామన్నారు. టీడీపీ హయంలో నామమాత్రంగా 1200 ప్లాట్ల నిర్మాణం జరిగితే, వైసీపీ పాలనలో 9వేల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు కొడాలి నాని. రూ.900 కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఔట్ అభివృద్ధి చేశామని తెలిపారు. లబ్ధిదారుల తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాన కొడాలి నాని. సీఎం జగన్ పర్యటనలో గుడివాడ ప్రజానీకం పాల్గొనాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.

మే 19న గుడివాడ టిడ్కో హౌసింగ్ కాలనీని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో 27వేల 872 ఇళ్లు నిర్మిస్తున్నారు. 8,912 ఇళ్లతో గుడివాడ టిడ్కో లేఅవుట్ రాష్ట్రంలోనే అతిపెద్దది. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత, APTIDCO (AP టౌన్‌షిప్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరనుంది. గుడివాడ టిడ్కో ఇళ్లను మే 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేయనున్నారు. గుడివాడ టిడ్కో కాలనీ ఒకే చోట వేలాది ఇళ్లను నిర్మించడంలో అతిపెద్ద హౌసింగ్ కాలనీ.

గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8వేల 912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6వేల 700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల 872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా AP TIDCO.. పట్టణ ప్రాంతాల్లో 27వేల 872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేదల గృహ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూపొందించిన ఉమ్మడి వెంచర్ TIDCO గృహాలు.