Tirumala tirupati: వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం.. అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజ

తిరుమల తిరుపతిలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్‌ ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ.. బ్ర‌హ్మ ముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.

Tirumala tirupati: వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం.. అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా మెట్లపూజ

Tirumala tirupati

Tirumala tirupati: తిరుమల తిరుపతిలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శ‌నివారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్‌ ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ.. బ్ర‌హ్మ ముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.

పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా చాటిచెప్పారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భజన మండళ్ళ సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు.

భజన మండళ్ళ సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరీ, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరీ కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్ళి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని అన్నారు. కాగా, అంతకుముందు భజనమండళ్ళ భక్తులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుంచి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేల‌ మందికిపైగా భ‌జ‌న మండ‌ళ్ళ స‌భ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను ఎక్కారు.

COVID 19: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. కొత్తగా 9,520 మందికి కరోనా