YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా 9న ట్రాఫిక్ మళ్లింపు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు  రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి.

YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీ సందర్భంగా 9న ట్రాఫిక్ మళ్లింపు

Ysrcp Plenary

YSRCP Plenary :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు  రేపు, ఎల్లుండి (జులై 8,9) గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదకాకానిలో జాతీయ రహదారి-16 వద్ద జరుగుతాయి. ఈసందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని భారీ వాహనాలతో పాటు ఇతర ట్రాఫిక్‌ ప్లీనరీ జరిగే జాతీయ రహదారిపైకి రాకుండా ఇతర మార్గాల్లోకి మళ్లించినట్టు చెప్పారు. ఈ నిబంధనలు 9వ తేదీ  శనివారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.

> చెన్నై వైపు నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం, నందిగామ, వైపు వెళ్లే భారీ గూడ్స్‌ వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట నుంచి చీరాల–బాపట్ల–రేపల్లె– అవనిగడ్డ– పామర్రు– గుడివాడ– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు
> గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు క్రాస్‌ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్‌ మీదుగా అవనిగడ్డ, పామర్రు– గుడివాడ– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.

> విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుడివాడ– పామర్రు– అవనిగడ్డ– రేపల్లె– బాపట్ల– చీరాల– త్రోవగుంట– ఒంగోలు మీదుగా మళ్లించారు.
> విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే లారీలు, భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి నూజివీడు– మైలవరం– జి.కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు.
>  హైదరాబాద్‌ వైపు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు – మైలవరం– నూజివీడు– హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా అనుమతిస్తారు.

Ysrcp Plenary Traffic Diversion Map

Ysrcp Plenary Traffic Diversion Map

> చెన్నై వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే మల్టీ యాక్సిల్‌ గూడ్స్‌ వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారికి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు.
> విశాఖపట్నం వైపు నుంచి చెన్నై వైపు వెళ్లే మల్టీ యాక్సిల్‌ గూడ్స్‌ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ వద్ద, పొట్టిపాడు టోల్‌గేట్‌ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేసి, రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు.

ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌ ..
> విజయవాడ నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు కాజా టోల్‌ ప్లాజా వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్‌ వద్ద, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.
>  గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతేరు రోడ్డుపైన, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్, రైన్‌ ట్రీ అపార్ట్‌మెంట్స్‌ పక్కన పార్కింగ్‌ ఇచ్చారు.