Wild Animal Organs Trafficking : శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల అక్రమ రవాణా

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల రహస్య అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు షాపుల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఉడుము అవయవాలు, ముళ్ల పంది అవయవాలతో పాటు సాంబారు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.

Wild Animal Organs Trafficking : శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల అక్రమ రవాణా

Wild Animal Organs Trafficking

Wild Animal Organs Trafficking  నంద్యాల జిల్లా శ్రీశైలంలో అడవి జంతువుల అవయవాల రహస్య అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. పలు షాపుల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి ఉడుము అవయవాలు, ముళ్ల పంది అవయవాలతో పాటు సాంబారు జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నెమలి పింఛాలను పట్టుకున్నారు.

వాటిలో కొన్ని సహజసిద్ధమైనవి కాగా.. మరికొన్ని కుత్రిమమైనవి ఉన్నాయి. ఉడుము అవయవాలను ఇంట్లో ఉంచుకుంటే మంచిదని కొందరు జ్యోతిష్యులు చేస్తున్న ప్రచారంతో బీహార్‌, ఉత్తప్రదేశ్‌ నుంచి ఉడుము అవయవాలను అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు.

ఘోరాతి ఘోరం: 350 ఏనుగులు మృతి!..ఆ అడవిలో ఎక్కడ చూసినా ఏనుగుల కళేబరాలే..!!

ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులు దుర్గాప్రసాద్‌, వేణు, జయచంద్ర గుప్తాను అరెస్టు చేశారు. మరికొందరిపై నిఘా పెట్టారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు.