విషాదం..ముగ్గురన్నదమ్ముల్లో ఇద్దరు మృతి

విషాదం..ముగ్గురన్నదమ్ముల్లో ఇద్దరు మృతి

కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది.

వినుకొండకు చెందిన ఒక వ్యక్తి ప్రకాశం జిల్లాలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఆయనకు వైరస్ సోకింది. ఆయన సోదరుల్లో మరోకరికి లక్షణాలు కనిపించాయి. ఇద్దరూ రిమ్స్ ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

టీ స్టాల్ నడుపుకుంటున్న అతని మరో సోదరుడితో పాటు వారి కుటుంబ సభ్యులు నలుగురిని గుంటూరు ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంచారు. ఆ సోదరుడు గుండెపోటుతో మరణించాడు. మృతదేహా తీసుకునేందుకు స్ధానికంగా ఎవరూ లేకపోవటంతో అక్కడే ఖననం చేశారు.

ఈవిషాదం మరువక ముందే రిమ్స్ లో చికిత్స పొందుతున్నల్యాబ్ టెక్నీషియన్ మరణించాడు. అక్కడే చికిత్స పొందుతున్న మరో సోదరుడు ఇంకా కోలుకోలేదు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు తక్కువకాలంలో మృత్యువాత పడటంతో కన్నవారికి అంతులేని బాధను మిగిల్చింది. కరోనా కారణంతో అయినవారు కూడా కడసారి చూపు చూసుకోలేకపోయారు.