జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ : వైవీ సుబ్బారెడ్డి

జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి ట్రయల్ రన్ : వైవీ సుబ్బారెడ్డి

Srivaru

yv-subbareddy:తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ 8న ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. మంగళవారం (జూన్ 2, 2020) మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులు సామాజిక దూరం పాటిస్తూ టీటీడీ ఉద్యోగులు.. స్థానికులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అధికారుల సూచనల మేరకు దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. భక్తుుల శానిటైజేషన్ చేసుకోవడంతో పాటుగా సామాజిక దూరం పాటించాలన్నారు.

ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలిపిరి దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి పుష్కరిణిలో భక్తుల స్నానానికి అనుమతి లేదని చెప్పారు.

శ్రీవారి దర్శనానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనాపై కేంద్రం సూంచించిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల రెండు నెలలకు పైగా మూతపడ్డ టీటీడీ తిరిగి తెరుచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం విధితమే.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల సామాజిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.