ఒక్క వెంట్రుక కూడా అక్రమంగా బయటకు వెళ్లదు : టీటీడీ ఈవో

ఒక్క వెంట్రుక కూడా అక్రమంగా బయటకు వెళ్లదు : టీటీడీ ఈవో

Ttd Evo Clarity On The Issue Hair Smuggling

TTD Evo Clarity on the issue hair smuggling : తిరుమలలో భక్తులు స్వామివారికి మొక్కులుగా తల నీలాలు సమర్పిస్తారనే విషయం తెలిసిందే. ఈ తలనీల విక్రయాలపై పలు వివాదాలు వస్తుంటాయి. ఈ క్రమంలో టీటీడీ నుంచి తలనీలాలు అక్రమంగా స్మగ్లింగ్ జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. టీటీడీ తలనీలపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారనీ ఇది సరైందికాదని అన్నారు. మయన్మార్ సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న వెంట్రుకలకు టీటీడీకి ఎటువంటి సంబంధం లేదనీ..ఈ తరలింపుకు సంబంధించిన రిపోర్టులో టీటీడీ పేరు లేదనీ..టీటీడీలో ప్రెసెస్ చేయండా తలనీలాలను విక్రయించం అని తేల్చి చెప్పారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో టీటీడీ తలనీలాలను తిరుపతికి తరలిస్తామనీ..ఒక్క వెంట్రుక కూడా అక్రమంగా బైటకు వెళ్లదని ఈవో ధర్మారెడ్డి స్పష్టంచేశారు.

కాగా గత నెలలలో భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో తలనీలాల ‘స్మగ్లింగ్‌’ కలకలం సృష్టించింది. మిజోరం సరిహద్దులగుండా 120 బ్యాగుల్లో రూ.18.17 లక్షల విలువైన అన్ ప్రాసెసింగ్ కేశాలను మయన్మార్‌ మీదుగా చైనాకు స్మగ్లింగ్‌ చేస్తుండగా.. భారత సైన్యానికి చెందిన అసోం రైఫిల్స్‌ వాటిని పట్టుకుంది. ఈ కేశాలను తిరుపతి నుంచే రవాణా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే… ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది.

మయన్మార్‌తో మిజోరంకు 510 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇక్కడి నుంచి పలురకాల వస్తువుల స్మగ్లింగ్‌ జరుగుతుంటాయి. ఫిబ్రవరి 7న కస్టమ్స్‌ విభాగంతో కలిసి అసోం రైఫిల్స్‌ సెర్చ్‌షిప్‌ బెటాలియన్‌ జవాన్లు ఉమ్మడి ఆపరేషన్‌ చేపట్టగా.. మయన్మార్‌ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో రెండు ట్రక్కులను అడ్డుకున్నారు. వాటిలో 120 బస్తాల తల వెంట్రుకలు బయటపడ్డాయి. డ్రైవర్లను విచారించగా వాటిని తిరుపతి నుంచి తరలిస్తున్నట్లు తేలింది. కానీ టీటీడీ మాత్రం ఈ వెంట్రుకలకు తిరుమలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.

పట్టుబడిన వెంట్రుకల విలువ రూ.1.80 కోట్లుగా కస్టమ్స్‌ అధికారులు నిర్ధారించారు. తిరుపతి తరహాలోనే దేశవ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల నుంచి వెంట్రుకలు ఇలా అక్రమంగా మయన్మార్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. వీటిని తొలుత థాయ్‌లాండ్‌ చేరుస్తారని, అక్కడ ప్రాసెస్‌ చేశాక చైనాకు తరలిస్తారని సమాచారం. చైనాలో వాటిని విగ్గులుగా మార్చి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ విగ్‌ మార్కెట్లో చైనాకు 70 శాతం వాటా ఉండడం గమనార్హం.

అమ్మకం వరకే మా బాధ్యత అంటున్న టీటీడీ
మిజోరంలో పట్టుబడిన తల వెంట్రుకలతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ స్పష్టం చేసింది. పేర్కొంది. దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘టీటీడీ వద్ద ఉన్న తలనీలాలను ఈ-ప్లాట్‌ఫాం ద్వారా అంతర్జాతీయ టెండర్లు పిలిచి ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికి విక్రయిస్తాం. సంబంధిత బిడ్డర్‌ నుంచి జీఎస్టీ కూడా కట్టించుకుని తలనీలాలను అప్పగిస్తాం. బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలోనే ఏ ప్రాంతంలోనైనా విక్రయిస్తారా అనేది మాకు సంబంధించిన విషయం కాదని తెలిపింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయి. బహుశా అక్కడ దొరికిన కేశాలు దేనికి సంబంధించినవో అయి ఉండవచ్చని అన్నారు.

మయన్మార్‌ సరిహద్దుల్లో వెంట్రులను పట్టుకున్న అధికారులు అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల వివరాలు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్‌ లిస్టులో పెడతామని తెలిపారు. ఇంకోవైపు.. తలనీలాల అంశంపై టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి హెచ్చరించారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు సమర్పించే తలనీలాలను అత్యంత భద్రత నడుమ తిరుపతికి తరలించి.. సీసీ కెమెరాల నిఘాలో భద్రపరుస్తామన్నారు. వేలం తర్వాత బిడ్డర్‌కు అప్పగిస్తామని, తర్వాత వారు ఏం చేసినా టీటీడీకి సంబంధం ఉండదని చెప్పారు. పట్టుబడిన 120 బ్యాగుల తలనీలాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఇంకా స్పష్టం కాలేదన్నారు. టీటీడీపై మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. దీనిపై టీటీడీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసులు కూడా నమోదు చేశారని తెలిపారు.