Tirumala : జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు స్వామి వారి వ‌స్త్రాలు ఈ -వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది.

Tirumala : జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు స్వామి వారి వ‌స్త్రాలు ఈ -వేలం

Tirumala E Auction

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది. టీటీడీ వద్ద ఉన్న 149 లాట్ల వ‌స్త్రాల‌‌ను జూన్ 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేస్తామని టీటీడీ తెలిపింది.

ఇందులో పాలిస్ట‌ర్ నైలాన్/నైలెక్స్ చీర‌లు, ఆర్ట్ సిల్క్ చీర‌లు, బ్లౌజ్‌పీస్‌లు కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయని తెలిపింది.  మరిన్ని ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం పని వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in  / www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని టీటీడీ తెలిపింది.

Also Read : Tirumala Rush : శ్రీవారి దర్శనానికి 16 గంటలు.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ