Pawan Kumar : కరోనాతో మరో జర్నలిస్టు కన్నుమూత

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కులోనూ పనిచేసిన పామర్తి పవన్ కుమార్ (38) శుక్రవారం (మే 14,2021) తెల్లవారుజామున కోవిడ్ తో మృతి చెందారు.

Pawan Kumar : కరోనాతో మరో జర్నలిస్టు కన్నుమూత

Pawan Kumar

Pawan Kumar : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కులోనూ పనిచేసిన పామర్తి పవన్ కుమార్ (38) శుక్రవారం (మే 14,2021) తెల్లవారుజామున కోవిడ్ తో మృతి చెందారు. ఆయనకు కోవిడ్ సోకిన తరువాత చికిత్స తీసుకుంటుండగా, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో బుధవారం కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

అయితే అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ లేదా హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయనీ, మెరుగైన ఆసుపత్రిలో చికిత్స అందించాలని స్థానిక వైద్యులు సూచించారు. అప్పటి వరకూ ఆక్సిజన్ అందించారు. అయితే శుక్రవారం ఏదైనా ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేసే లోపు, తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆక్సిజన్ స్థాయి పడిపోయి, తుది శ్వాస విడిచారు. పవన్ కుమార్ పలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో పనిచేశారు.

తన కథనాలకు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి నేషనల్ టెలివిజన్ అవార్డు సహా పలు అవార్డులు పొందారు. అంతకు సుమారు 20 రోజుల క్రితమే ఆయన తండ్రి కరోనాతో మరణించారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే ఆ కుటుంబంలో మరో తీరని విషాదం అలుముకుంది. పవన్ స్వస్థలం కృష్ణా జిల్లా మొవ్వ మండలం గూడపాడు గ్రామం. ఆయనకు భార్య మధు శ్రావణి, పదేళ్ల లోపు వయసున్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి అనాథలా మారిన ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదో ఒక రూపంలో సాయం అందించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.