Boy Disappearance Twist : పల్నాడు జిల్లాలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది.

Boy Disappearance Twist : పల్నాడు జిల్లాలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్

boy

Boy Disappearance Twist : పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇంటి సమీపంలో ఉన్న బావిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. పిట్ట గోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలో బాలుడు బావిలో జారి పడి మృతి చెందాడు. అయితే కొడుకు చనిపోయాడన్న డిప్రెషన్ లో బాలుడు కనిపించడం లేదని తల్లి చెప్పారు. దీంతో బాలుడి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు ఇంటి సమీపంలోని బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

బావిలో నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో తల్లి నిజం చెప్పింది. బాలుడు బావిలో జారి పడిపోయినట్లు తెలిపింది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలుడు కనిపించకుండా పోయాడని తండ్రి వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే డీఎస్పీతోపాటు పోలీసులు బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. కొంతకాలంగా బాలుడి తల్లి మానసిక స్థితి బాగలేదని స్థానికులు చెబుతున్నారు.

Boy In Borewell: విషాదం.. బోరుబావిలో పడ్డ బాలుడు మృతి.. ఫలించని నాలుగు రోజుల ప్రయత్నం

దీనిపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేశారు. తర్వాత బాలుడి కోసం ప్రత్యేక బృందాలు వెతికారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో అనుమానాస్సదంగా ఎవరైనా తిరిగారా? అన్నకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. తర్వాత బాలుడి తల్లిని విచారించగా భోజన తినిపిస్తున్న సమయంలో బాలుడు జారి బావిలో పడపోయాడని చెప్పారు. దీంతో బావిలో వెతకగా బాలుడి ఆచూకీ లభ్యమైంది. అయితే బాలుడు భోజనం చేస్తున్నప్పుడే బావిలో పడిపోయాడా? లేదా మరేదైనా కారణముందా? అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.