Anantapur Children : అనంతలో విషాదం.. ఆ ఇద్దరు చిన్నారులను ఒంటరి చేసింది..

అనంతపురంలో సంతోషం విరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగం వినిపిస్తోంది. తండ్రి దూరమైన ఏడాదికే తల్లి మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.

Anantapur Children : అనంతలో విషాదం.. ఆ ఇద్దరు చిన్నారులను ఒంటరి చేసింది..

Two Children Lost Their Parents In Anantapur

Anantapur Children : అనంతపురంలో సంతోషం విరిసిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద రాగం వినిపిస్తోంది. తండ్రి దూరమైన ఏడాదికే తల్లి మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. ముదిగుబ్బకి చెందిన రమేష్‌, తిరుపతమ్మలది మధ్యతరగతి కుటుంబం. అతను ఐషర్‌ వాహనానికి డ్రైవర్‌గా, ఆమె కుట్టుమిషన్‌తో జీవించే వారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అనూహ్య(11) ఆరో తరగతి, అస్మిత(7) రెండో తరగతి చదువుతున్నారు.

ఉన్నంతలోనే ఆనందంగా జీవిస్తున్న కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. తండ్రికి జాండీస్‌ వచ్చింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా నయం కాలేదు. ఆస్పత్రి ఫీజుల కోసం ఉన్న ఇంటినే అమ్మేశారు. సుమారు రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితంలేక గత ఏడాది ఏప్రిల్‌లో మరణించాడు.

చేతిలో చిల్లిగవ్వ లేని తిరుపతమ్మ ఇద్దరు పిల్లలతో మలకవేముల క్రాస్‌లోని పుట్టింటికి వచ్చింది. కుట్టు పని చేస్తూనే పిల్లలను చదివిస్తూ, నెట్టుకొచ్చింది. అయితే నెల క్రితం ఆమె జాండీస్‌తో అనారోగ్యానికి గురైంది. అనంతపురం, పుట్టపర్తిలోని పలు ఆసుపత్రుల్లో రూ.2 లక్షలు ఖర్చు చేసి, చూపించినా ఫలితం లేకపోయింది. ఈనెల 25న బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో మృతి చెందింది. నాన్న ప్రేమకు దూరమైన ఏడాదికే అమ్మ మరణించడంతో ఇద్దరు ఆడపిల్లలకు పెద్దదిక్కు కరవైంది.