AP : ఏపీలోనే నిరుద్యోగం ఎక్కువ – బాబు

దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు.

AP : ఏపీలోనే నిరుద్యోగం ఎక్కువ – బాబు

Babu

Chandra Babu : దక్షిణాదిలో ఏపీ రాష్ట్రంలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కరోనా కారణంగా సుమారు కోటి మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారని తెలపారు. 2021, జూన్ 21వ తేదీ సోమవారం ఆయన పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2.3 లక్షల పోస్టులను సీఎం జగన్ భర్తీ చేయాల్సి ఉందన్నారు. రైతుల బకాయిలు రూ. 3 వేల 600 కోట్లు విడుదల చేయాలని, రైతులు చేసే ఉత్పత్తులన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పన్నుల పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేశారాయన. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి తరలించాలని డిమాండ్ చేశారు.

అంతేగాకుండా..సీతానగరం ఘటనపై కూడా ఆయన స్పందించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. సీఎం జగన్ నివాసానికి డీజీపీ కార్యాలయం, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతిపై అత్యాచార ఘటన అమానుషమన్నారు. దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని అందులో డిమాండ్ చేశారు.