ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. లేటెస్ట్‌గా రాష్ట్రంలో కరోనా కేసులు 62 మాత్రమే నమోదయ్యాయి. 100కంటే తక్కువ కేసులు నమోదు కాగా.. ఒక్కరోజు వ్యవధిలో 22,094 నమూనాలను పరీక్షించగా 100కంటే తక్కువ కేసులు పాజిటివ్‌గా తేలాయి. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,88,485కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ విశాఖపట్నం జిల్లాలో ఒకరు చనిపోగా.. కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,160కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 102 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 962 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,33,67,616 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.