Vijayawada Durgamma: దుర్గగుడి హుండీల లెక్కింపులో చేతివాటం..మహామండపం బాత్రూమ్లో దాచిన బంగారం గుర్తింపు

Vijayawada Kanaka durgamma temple gold : అమ్మలగన్న అమ్మ విజయవాడ ఇంద్రీకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకే టోకరా వేసేందుకు యత్నించారు కొందరు ఆలయ సిబ్బంది. 12 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దుర్గమ్మ హుండీల లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించారు. అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారు కానుకలను అపహరించటానికి యత్నించారు. సోమవారం (మే 9,2022)శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం మహామండపం ఆరవ అంతస్థులో అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం జరిగింది.
ఈక్రమంలో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎస్పీఎఫ్ సిబ్బంది పురుషులు ఉపయోగించే బాత్రూమ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ ఉన్న వెస్ట్రన్ టాయిలెట్ పక్కన రెండు చిన్న ప్లాస్టిక్ కవర్లను గుర్తించారు. వీటిని వారు ఈవో భ్రమరాంబకు అప్పగించారు. దుర్గమ్మ భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతోపాటు గతంలో వెండి సింహాల మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో ఆలయ అధికారులు ఈ ఘటనకు సంబంధించి విషయాలను బయటకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నా విషయం కాస్తా బయటపడింది. మరోసారి ఆలయ సిబ్బంది చేతివాటం బయటపడింది.
కాగా దుర్గమ్మ హుండీల లెక్కింపు పకడ్బందీగా జరుగుతుంది. సీసీ కెమెరాల నిఘా, ఎస్పీఎఫ్ సిబ్బంది పహరా నడుమ లెక్కింపు ప్రాంతం వద్ద గట్టి నిఘా ఉంటుంది. కానుకలను లెక్కించడానికి వచ్చినవారిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కింపు పూర్తి చేసుకుని బయటకు వెళుతున్న సమయంలో కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మరి ఇంత గట్టి బందోబస్తు ఉన్నప్పటికీ అమ్మవారి కానుకలను దొంగిలించే ప్రయత్నం జరగడంపై ఆలయ అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. దొంగలెవరు అన్నదానిపై అంతర్గతంగా సిబ్బందిని విచారించి ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఇంటి దొంగలెవరో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు ఆలయ అధికారులు. ఈ ఘటన సోమవారమే జరిగినా బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు ఆలయ అధికారులు. సోమవారం రాత్రి వరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లుగా తెలుస్తోంది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
- Andhra Pradesh: పొదుపు పథకంతో మహిళల అభివృద్ది: మల్లాది విష్ణు
- Bonda Uma: మహిళలకు భద్రత కల్పించాలంటూ బోండా ఉమ ధర్నా
- Police Special Surveillance : ఉపాధ్యాయుల చలో సీఎంఓ కార్యక్రమంపై పోలీసులు ప్రత్యేక నిఘా
- Andhrapradesh : సీపీఎస్ను రద్దు చేయాలని CMO ముట్టడికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పిలుపు..విజయవాడలో 144 సెక్షన్
- Vijayawada : ఫ్లైఓవర్ పై ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ
1Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
2Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
3Dandruff : వేధించే చుండ్రు సమస్య!
4NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
5Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
6ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
7Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
8Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
9Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
10JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?