విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె

విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె

Vijayawada TDP mayor candidate Keshineni swetha : విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు టీడీపీ తమ మేయర్‌ అభ్యర్థిని ప్రకటించింది. 11వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న కేశినేని శ్వేత పేరును ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. శ్వేత.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కూతురు. నగర పాలక సంస్థ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

మరోవైపు విశాఖ ఉక్కు కోసం శుక్రవారం (మార్చి 5, 2021) తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేయగా.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలకు కూడా తమ వంతుగా మద్దతు ప్రకటిస్తున్నామని వెల్లడించారు.

బంద్‌ కారణంగా చిత్తూరు, తిరుపతిలో తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎప్పుడూ రాజీపడదని.. పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.