చెల్లెలు వరసయ్యే యువతిపై లైంగిక వేధింపులు…ప్రియుడితో కలిసి హత్య

చెల్లెలు వరసయ్యే యువతిపై లైంగిక వేధింపులు…ప్రియుడితో కలిసి హత్య

visakha police arrested victims through young lady chunni : హత్య జరిగిన ప్రదేశంలో లభించే ప్రతి ఒక్క ఆధారం ఆ కేసు సాల్వ్ చేయటంలో ఉపయోగపడుతుందనేది మరోసారి రుజువయ్యింది. విశాఖ జిల్లా పరవాడలో జరిగిన హత్యకేసులో ఘటనా స్ధలంలో లభించిన చున్నీ నిందితులను పట్టిచ్చింది. హతుడు రామిరెడ్డి దారుణనమైన పని చేశాడు, దాని ఫలితంగా హత్యకు గురయ్యాడు.

విశాఖపట్నంలో నివసించే రామిరెడ్డి ఇంట్లో వరసకు చెల్లెలయ్యే యువతి ఉండేది. వాళ్ళింట్లోనే నివాసం ఉంటూ సమీపంలోని ఒక షాపింగ్ మాల్ లో పనిచేస్తూ ఉండేది. యువతిపై కన్నేసిన రామిరెడ్డి ఆమెకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను రహస్యంగా సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. అప్పటి నుంచి అది చూపిస్తూ తన కోరిక తీర్చమని ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. రామిరెడ్డి వేధింపులు భరించలేని యువతి వాళ్ళ ఇంట్లోంచి, వేరే ఇంటికి వెళ్లిపోయింది.

అయినప్పటికీ రామిరెడ్డి ఆమెను వేధించటం మానలేదు. వీడియో చూపిస్తూ బెదిరించసాగాడు. అతని వేధింపులు భరించలేని యువతి తన ప్రియుడు కళ్యాణ్ కు విషయంచెప్పింది. ఇద్దరూ కలిసి రామిరెడ్డి పీడ వదిలించుకోవాలనుకున్నారు. కళ్యాణ్ చెప్పినట్లు గా రామిరెడ్డిని జనవరి 27 సాయంత్రం రమ్మని చెప్పింది ఆయువతి. అమ్మాయి తన దారిలోకి వచ్చిందని సంబంపడిన రామిరెడ్డి ఆ రోజు సాయంత్రం షాపింగ్ మాల్ కువెళ్ళాడు.

అక్కడ్నించి ఇద్దరూ కలిసి ఎన్టీపీసీ సమీపంలోని సోమునాయుడు పాలెం ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరికీ కనపడకుండా ఉండేలా గుట్టుగా ఉన్న ప్రదేశం చూసుకుని కూర్చుని మాట్లాడుకోవటం మొదలెట్టారు. వీరిని మొదటి నుంచి ఫాలో అవుతున్న యువతి ప్రియుడు కళ్యాణ్, అతని స్నేహితుడు… ఇద్దరూ కల్సి రామిరెడ్డి తలపై కర్రతో కొట్టి స్పృహ తప్పేలా చేశారు.

అనంతరం యువతి చున్నీ మెడకు బిగించి చంపేశారు. రామిరెడ్డి సెల్ ఫోన్ తీసుకుని అక్కడ్నించి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలంలో లభించిన చున్నీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చున్నీ ఆధారంగా యువతిని గుర్తించిన పోలీసులు యువతితో పాటు ఆమెప్రియుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.