న్యూఇయర్ వేడుకల్లో విషాదం : గోవాలో తెలుగు యువకులు మృతి

గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 07:42 AM IST
న్యూఇయర్ వేడుకల్లో విషాదం : గోవాలో తెలుగు యువకులు మృతి

గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు.

గోవాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు తెలుగు యువకులు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విశాఖకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లారు. సన్‌బర్న్ ఈవెంట్ లో పాల్గొన్నారు. శుక్రవారం(డిసెంబర్ 27,2019) మధ్యాహ్నం వెగటోర్ బీచ్ సమీపంలోని వేదిక బయట నిలబడ్డారు. కాసేపటి తర్వాత ఇద్దరూ అక్కడే కుప్పకూలారు. వెంటనే అప్రమత్తమైన ఈవెంట్ నిర్వాహకులు ఇద్దరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్థారించారు.

దీనిపై ఈవెంట్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గుండెపోటు కూడా కారణమై ఉండొచ్చని సందేహిస్తున్నారు. దీంతో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ వస్తే కానీ మృతికి కారణాలు చెప్పలేమని గోవా పోలీసులు తెలిపారు. మృతులను సాయిప్రసాద్, వెంకట కృష్ణలుగా గుర్తించారు. ఈ విషయం తెలిసి సాయి, వెంకట కృష్ణ ఇళ్లలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు గోవాకి చేరుకున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారు. సరదాగా గడిపేందుకు తమ పిల్లలు గోవా వెళ్లారని కుటుంబసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విషాదం నెలకొందని వాపోయారు. 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టూరిస్టులను షాక్ కి గురి చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో గోవా వస్తారు. గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తారు. చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ఉంటాయి.