భవనం గోడ కూలి ఇద్దరు మృతి

భవనం గోడ కూలి ఇద్దరు మృతి

విశాఖ నగరం దాబా గార్డెన్స్ ప్రాంతంలో వినాయకచవితి పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ అకస్మాత్తుగా కూలిపడింది. తవ్వకం పనుల్లో ఉన్న ముగ్గురు కూలీలపై మట్టిపెల్లలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్ రావు, శివలు అక్కడికక్కడే మృతి చెందారు. 

విజయనగరంలోని బాడంగి చెందిన శంకర్ రావు, తమిళనాడుకు చెందిన శివలు ప్రాణాలు కోల్పోయారు. రెండు గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను పూర్తి చేశారు. ప్రొక్లైన్, క్రేన్ ల సాయంతో మట్టిపెల్లలు తొలగించారు. రెస్క్యూ టీంతో పాటు, స్థానికులు సహకారం అందించడంతో కూలిన గోడ కింద ఉన్న ముగ్గుర్ని బయటకి తీశారు. 

సెల్వన్ అనే కార్మికుడు ప్రాణాలు కాపాడగలిగినట్లు డీసీపీ రంగారెడ్డి తెలిపారు. ఓ మత సంస్థ కోసం నిర్మిస్తున్న భవనంలో రాత్రి 9గంటల వరకూ పని జరుగుతుండటం పట్ల విచారణ చేపట్టారు.