Extramarital Affair: కొడుకు బండారం బయటపెట్టిన తల్లి: భర్తను, ప్రియురాలిని చితకబాదిన భార్య

ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Extramarital Affair: కొడుకు బండారం బయటపెట్టిన తల్లి: భర్తను, ప్రియురాలిని చితకబాదిన భార్య

Extramarital

Extramarital Affair: పెళ్ళై, పిల్లలు ఉన్న ఓ వ్యక్తి..మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా..చివరకు భార్య చేతికి చిక్కి చావు దెబ్బలు తిన్నాడు. ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం వెలుగు చూసిన ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. కె.గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువుపుంతకు చెందిన రాయుడు శ్రీనివాస్, కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన చీకట్ల వీరలక్ష్మిని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్ళివస్తూండేవాడు. ఈక్రమంలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మరో వివాహిత బెల్లం లక్ష్మీతో పరిచయం పెంచుకున్న రాయుడు శ్రీనివాస్ తరచూ ఆమెను ఏకాంతంగా కలుసుకునేవాడు.

Also read:Woman Rescued: కోడలిని భూత వైద్యుడికి అప్పగించిన అత్తింటి వారు: మహిళపై 80 రోజులుగా అఘాయిత్యం

కొన్ని రోజుల క్రితం భార్య వీరలక్ష్మి నడకుదురులోని పుట్టింటికి వెళ్లగా శనివారం రాత్రి ప్రియురాలు లక్ష్మిని నల్లచెరువుపుంతలోని తన ఇంటికి తీసుకువచ్చాడు శ్రీనివాస్. కొడుకు బాగోతాన్ని గమనించిన శ్రీనివాస్ తల్లి సుబ్బాయమ్మే స్వయంగా కొడుకు ప్రియురాలితో ఉన్న సమయంలో ఇంటికి తాళం వేసి..కోడలికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆదివారం ఉదయం పోలీసులను తీసుకుని నల్లచెరువుపుంతకు చేరుకున్న వీరలక్ష్మి..పోలీసులు, గ్రామ పెద్దల సమక్షంలో తాళం తెరిచి ప్రియురాలితో కులుకుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివాహేతర సంబంధంపై భర్తను నిలదీసిన వీరలక్ష్మి..కోపం పట్టలేక భర్త, ప్రియురాలిపై దాడి చేసింది. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాయుడు శ్రీనివాస్ అతని ప్రియురాలిని స్టేషన్‌కు తరలించారు.

Also read:Crime News: యువతినంటూ మహిళలకే టోకరా వేసిన కేటుగాడు: 500 మంది నుంచి రూ.3.5 కోట్లు స్వాహా