ప్రియుడిపై మోజు..భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపిన భార్య

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 05:22 AM IST
ప్రియుడిపై మోజు..భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి చంపిన భార్య

ప్రియుడిపై మోజు పెంచుకున్న ఓ భార్య భర్తను దారుణంగా కడ తేర్చింది. కట్టుకున్నవాడిని గడ్డిపోచగా భావించింది. ప్రియుడిపై మోజు పెరిగిపోవటంతో అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్తను అతి దారుణంగా చంపేసిన దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోచోటుచేసుకుంది. 

జిల్లాలోని సకినేటిపల్లి మండలం ఉయ్యూరు మెరకలో ఓ భార్య భర్త ఉప్పు ప్రసాద్ ను భార్య ప్రశాంతి జూన్ 2వ తేదీన నిద్రమాత్రలు ఇచ్చి చంపేసింది. ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా సాధారణ మరణంగా క్రియేట్ చేసింది. బంధువుల్ని నమ్మించింది. దీంతో బంధువులు చిన్నవయస్సులోనే నీకు ఎంత కష్టం వచ్చిందమ్మా..అంటూ ఆమెను ఓదార్చారు.

అనంతరం ఉప్పు ప్రసాద్ కు అంత్యక్రియలు నిర్వహించారు. అంతటితో తాను చేసిన పని ఎవ్వరికీ అనుమానం రాకుండా జరిగినందుకు ప్రశాంతి సంతోషం వ్యక్తంచేసింది. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. కానీ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రశాంతి ఫోన్ వాయిస్ రికార్డింగ్ తో భర్త హత్య కుట్ర బైటపడింది.

చప్పర్ల శివ అనే వ్యక్తితో ప్రశాంతికి వివాహేతర సంబంధం ఉంది. దానికి భర్త అడ్డు వస్తున్నాడనేనెపంతో భర్తను కడతేర్చాలని ప్లాన్ వేసింది. దీంట్లో భాగంగా జూన్ 2న భర్త ఉప్పు ప్రసాద్ కు నిద్రమాత్రలు ఇచ్చింది.దీంతో నిద్రలోనే చనిపోయాడు. వెంటనే తన భర్త చనిపోయాడని బంధువులకు సమాచారం అందించింది. దీంతో మరుసటి రోజు ఉప్పు ప్రసాద్ కు అంత్యక్రియలు నిర్వహించటంతో ప్రశాంతి హాయిగా ఊపిరి పీల్చుకుంది. కానీ చేసిన పాపం బైటపడింది. 

ప్రశాంతి వ్యవహారంపై మొదటి నుంచి అనుమానాలు ఉన్న స్థానికులు..ఉప్పు ప్రసాద్ బంధువుల్లో కొంతమందికి విషయాన్ని చెప్పారు. దీంతో ప్రశాంతి ఫోన్ పై నిఘా పెట్టారు. ఈ క్రమంలో భర్త చనిపోయిన తరువాత ప్రియుడు శివతో ఫోన్ మాట్లాడుతూ..మనకు అడ్డుగా  ఉన్న నా భర్తను చంపేశానని చెప్పిన వాయిస్ ను రికార్డు చేయటంతో ప్రశాంతి బండారం బైటపడింది.

ఈ ఫోన్ వాయిస్ ఆధారంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా అంత్యక్రియలు నిర్వించిన ఉప్పు ప్రసాద్ మృతదేహాన్ని (అస్తికలకు) వెలికి తీసి టెస్ట్ లకు పంపించారు.

Read: యువతిని ఎరగా వేసి యువకుడి హత్య