TTD Warning : సోషల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేసే వారిపై చట్టపరంగా చ‌ర్య‌లు – టీటీడీ వార్నింగ్

టీటీడీ.. భక్తులను కులాల‌ వారీగా విభ‌జించి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమతిస్తోంద‌ని యూట్యూబ్ ఛాన‌ల్ లో దుష్ప్ర‌చారం చేశారని టీటీడీ మండిపడింది. భ‌క్తుల‌ను రెచ్చ‌గొట్టేలా సోషల్ మీడియాలో

TTD Warning : సోషల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేసే వారిపై చట్టపరంగా చ‌ర్య‌లు – టీటీడీ వార్నింగ్

Ttd Warning

TTD Warning : తిరుమల శ్రీవారి దర్శనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చెప్పింది. టీటీడీ.. భక్తులను కులాల‌ వారీగా విభ‌జించి శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమతిస్తోంద‌ని భార‌త్ మార్గ్ యూట్యూబ్ ఛాన‌ల్ లో టీటీడీపై దుష్ప్ర‌చారం చేశారని టీటీడీ మండిపడింది. ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. యూట్యూబ్ ఛాన‌ల్ నిరాధార‌మైన నిందారోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు టీటీడీ చెప్పింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో 21 రోజులు శ్రీ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించ‌ లేద‌ని ఆ ఛాన‌ల్‌లో ఆరోపించ‌డం పూర్తిగా అవాస్త‌వం అంది. ఆ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు నిలిపివేశారే తప్ప స్వామి వారికి జరిగే పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయని క్లారిటీ ఇచ్చింది.

Corona Pfizer : అప్పటివరకు కరోనా అంతం కాదు..! షాకింగ్ విషయం చెప్పిన ప్రముఖ ఫార్మా కంపెనీ

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో కార్యక్రమాలు చేపట్టామని తెలియజేసింది. ఇందులో భాగంగా 2021 అక్టోబ‌ర్ 7 నుంచి 14వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీ‌వారి బ్రహ్మోత్సవ ద‌ర్శనం క‌ల్పించామని స్పష్టం చేసింది. ఇదే త‌ర‌హాలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి నిర్ణయం తీసుకుందని వివరించారు.

భ‌క్తులను కులాల‌వారీగా విభ‌జించి ద‌ర్శ‌నం చేయిస్తున్నార‌ని ఆరోపించడం దుర్మార్గం అంది. టీటీడీ సొమ్ముతో రాష్ట్ర ప్ర‌భుత్వం పాస్ట‌ర్ల‌ను పోషిస్తోంద‌ని, జెరూస‌లెం యాత్ర‌, హ‌జ్ యాత్ర‌కు నిధులు అందిస్తోంద‌నడం స‌త్య‌దూర‌మైన ఆరోపణ అని టీటీడీ చెప్పింది. గోసంర‌క్ష‌ణ కోసం టీటీడీ అనేక చ‌ర్య‌లు చేప‌డుతోందని తెలిపింది.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

తిరుప‌తి, ప‌ల‌మ‌నేరులోని గోశాల‌ల్లో దేశవాళీ గోవుల సంర‌క్ష‌ణ‌తోపాటు వాటి సంత‌తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. భక్తుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా తిరుమ‌ల పుణ్య‌క్షేత్రంపై, ప్రపంచంలో ఏ ఇతర ఆలయాల్లో లేని విధంగా ఇక్క‌డ అమ‌ల‌వుతున్న ద‌ర్శ‌న విధానంపై కుట్ర పూరిత, అవాస్త‌వ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం మంచిది కాదని టీటీడీ హితవు పలికింది. అవాస్తవ ప్రచారాలు, ఆరోప‌ణ‌ల‌ను భ‌క్తులు నమ్మొద్దని కోరింది. భ‌క్తుల‌ను రెచ్చ‌గొట్టేలా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.