భూతగాదాల నేపథ్యంలో తుపాకీతో మహిళను కాల్చి చంపిన గిరిజనుడు..మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పు
Woman brutally murder : విశాఖ జిల్లా అరకులో దారుణం జరిగింది. ఓ మహిళ హత్య గావించబడింది. భూతగాదాల నేపథ్యంలో మహిళను స్థానిక గిరిజనుడు పాంగి దామోదర్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.
అంతటితో ఆగకుండా మృతురాలి బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టాడు. డుంబ్రిగూడ మండలం రంగిలసింగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు దామోదర్ కోసం గాలిస్తున్నారు. భూతగాదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.